Homeకాజిపేట్కాజిపేట్ : ఖో-ఖో సమరానికి ముస్తాబైన రైల్వే స్టేడియం

కాజిపేట్ : ఖో-ఖో సమరానికి ముస్తాబైన రైల్వే స్టేడియం

క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 58వ సీనియర్ నేషనల్ ఖో-ఖో ఛాంపియన్‌షిప్ (2025-26) నిర్వహణకు వరంగల్‌లోని కాజీపేట రైల్వే స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ జాతీయ స్థాయి క్రీడా సంబరం జరగనుంది.

పోటీల కోసం స్టేడియంలో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా కోర్ట్ మార్కింగ్ చేయడంతో పాటు, రాత్రి వేళల్లో కూడా మ్యాచ్‌లు సాఫీగా సాగేలా భారీ ఫ్లడ్ లైట్లను అమర్చారు. స్టేడియం ప్రాంగణమంతా ఫ్లెక్సీలు, భారీ కటౌట్లతో పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.

ఈ మెగా టోర్నీలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి సుమారు 1,976 మంది క్రీడాకారులు తమ ప్రతిభను చాటనున్నారు. ఇప్పటికే కేరళ, అస్సాం, గోవా వంటి రాష్ట్రాల జట్లు కాజీపేటకు చేరుకున్నాయి.

వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక పాఠశాలలు, కళాశాలలు మరియు లాడ్జీలలో బస ఏర్పాట్లు చేశారు. వారందరికీ నాణ్యమైన భోజన వసతి కల్పించేలా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ జాతీయ స్థాయి పోటీలు వరంగల్ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తాయని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments