తెలంగాణ శాసనసభలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు.
ఆయన స్పీచ్లో ప్రధానంగా వైద్యం, విద్య, పన్ను రాయితీలపై దృష్టి సారించారు.
వైద్య రంగం – MGM హాస్పిటల్ అభివృద్ధి
వరంగల్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (MGM) హాస్పిటల్ ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
ఛత్తీస్గఢ్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ వంటి పక్క జిల్లాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తారు.
ఇటీవల సిటీ స్కానర్ పాడవడంతో సుమారు 30 మంది రోగులను హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
అధికారులతో మాట్లాడి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రిని మరింత బలోపేతం చేయాలని, అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.
విద్య రంగం – ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.
హనుమకొండలో ఈ పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వ భూమి లేకపోవడంతో కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని స్థలాన్ని కేటాయించేందుకు స్థానికంగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
అయితే BRSV మరియు ABVP విద్యార్థి సంఘాలు దీనికి వ్యతిరేకిస్తున్నాయని, గతంలో KG to PG విద్యా విధానం వాగ్దానం చేసి అమలు చేయని వారే ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుపడుతున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ప్రభుత్వం త్వరగా స్థలం కేటాయించి, నిర్మాణ పనులకు సహకారం అందించాలని కోరారు.
పన్ను రాయితీ
GHMC పరిధిలో అపార్ట్మెంట్ నివాసులకు 90% ప్రాపర్టీ ట్యాక్స్ రాయితీ ఇచ్చినట్టుగా, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో కూడా ఈ రాయితీని అమలు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.