Homeస్టోరీస్కోటీశ్వరుడు.. రాపిడో డ్రైవరయ్యాడు

కోటీశ్వరుడు.. రాపిడో డ్రైవరయ్యాడు

కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను తలకిందులు చేసింది. దానికి ఒక నిదర్శనమే ఈ వార్త. ఒకప్పుడు కోట్లలో వ్యాపారం చేసిన ఒక వ్యక్తి, నేడు తన జీవనాధారం కోసం రాపిడో (Rapido) డ్రైవర్‌గా మారిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సదరు వ్యక్తి గతంలో భారీ వ్యాపారవేత్త. అయితే, కోవిడ్ సంక్షోభం కారణంగా ఆయన తన వ్యాపారంలో ఏకంగా ₹14 కోట్లు నష్టపోయారు. వ్యాపారం కోల్పోయి, చేతిలో చిల్లిగవ్వ లేని స్థితిలో కుటుంబ పోషణ కోసం ఆయన రాపిడో బైక్ టాక్సీ నడపడం ప్రారంభించారు.

 ఆయన సామాన్యుడేమీ కాదు, ప్రతిష్టాత్మకమైన Amity యూనివర్సిటీలో చదువుకున్న విద్యావంతుడు.

ఒక ప్రయాణికుడితో ప్రయాణిస్తున్న సమయంలో ఆయన తన బాధను పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ హృదయ విదారక గాథ నెట్టింట అందరినీ కలిచివేస్తోంది. ఇప్పటికీ దేవుడిపై నమ్మకం ఉంది. ఓటమిని ఒప్పుకోను” అని ఆయన చెబుతున్న మాటలు ఆయన ధైర్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments