Homeతెలంగాణమేడారం భక్తుల కోసం భారీ పార్కింగ్ ఏర్పాటు: 10 ఎకరాల స్థలం సిద్ధం

మేడారం భక్తుల కోసం భారీ పార్కింగ్ ఏర్పాటు: 10 ఎకరాల స్థలం సిద్ధం

మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర సమయంలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు మరియు భక్తులకు పార్కింగ్ ఇబ్బందులు కలగకుండా గట్టమ్మ ఆలయ సమీపంలో 10 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం సిద్ధం చేశారు.

బుధవారం ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ మరియు డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ కలిసి ఈ పార్కింగ్ స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. జాతర సమయంలో గట్టమ్మ వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది. ఈ 10 ఎకరాల అదనపు పార్కింగ్ స్థలం వల్ల ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.

పార్కింగ్ కోసం తగిన స్థలాన్ని కేటాయించినందుకు అటవీశాఖ అధికారులకు ఎస్పీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు మరియు అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని వారు నిర్ణయించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments