గీసుగొండ మండల కేంద్రంలో మామునూరు ఏసిపి వెంకటేష్ ఆధ్వర్యంలో శనివారం మామునూరు ఏసిపి వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతలపై ప్రజల్లో భరోసా కల్పించేలా ర్యాలీ చేపట్టారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు కోరారు. గీసుకొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, ఎస్.ఐ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.