Homeకాజిపేట్Dr Kadiyam Kavya | దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే

Dr Kadiyam Kavya | దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే

హనుమకొండ

దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది

విద్యే విద్యార్థుల జీవితాన్ని మలిచే ఆయుధం

క్రమశిక్షణ, కఠిన శ్రమ, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు

విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకం ౼ వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

హనుమకొండ, పెద్దపెండ్యాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో నిర్వహించిన ఆరోహన్-2025 వార్షికోత్సవ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముందుగా ఎంపీ డా.కడియం కావ్య జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

DPS

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ… దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు. విద్యే విద్యార్థుల జీవితాన్ని మలిచే ప్రధాన ఆయుధమని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ ఆసక్తులు, నైపుణ్యాలను గుర్తించి స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, కఠిన శ్రమ, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని అన్నారు.

Kids

అలాగే ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను గుర్తించి భయపడకుండా ముందుకు సాగాలని ప్రోత్సహించారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌, టెక్నాలజీపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. వైఫల్యాలను భయపడకుండా అవే విజయానికి మెట్లుగా మలచుకోని ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు తమ కెరీర్ ఎంపికలో ఇతరుల ఒత్తిడికి లోనుకాకుండా తమ ఇష్టాలను, సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. లక్ష్యం స్పష్టంగా ఉంటే భవిష్యత్తులో తప్పక విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. విద్యార్థులకు సరైన దిశానిర్దేశం చేయడంలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, ఇలాంటి కార్యక్రమాలను పాఠశాలల్లో నిరంతరం నిర్వహించాలని ఎంపీ సూచించారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకమని తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు ఎంపీ సర్టిఫికెట్ లు, మెమెంటో లను అందజేసారు. అనంతరం ఎంపీ డాక్టర్ కడియం కావ్య విద్యార్థులతో మమేకమై వారిని ఆప్యాయంగా పలకరించారు.

Arohan 2025

ఈ కార్యక్రమంలో NIT వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాదర్ సుబుద్ధి, డీపీస్ డైరెక్టర్ రాజి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, వైస్ చైర్మన్ రవి కిరణ్ రెడ్డి, ప్రిన్సిపల్ ఇన్నా రెడ్డి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments