ఓ మహిళ కు మాయ మాటలు చెప్పి ఆమె పేరు పై బ్యాంకులో లోన్ తీసుకొని తిరిగి చెల్లించకుండా మోసం చేసి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కి తాను స్నేహితుడిని అంటూ బెదిరించిన కేసులో నర్సంపేట పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండి భారతి కుమారుడు బండి సందీప్ పైన సుబేదారి పోలీసులు కేసు నమోదు.
హనుమకొండ చౌరస్తాలో లేడీస్ ఎంపోరియం నిర్వహించే జయసుధ పేరుపై 20 లక్షలు బ్యాంకు లోన్ తీసుకొని ఆమెని లైంగిక వేధింపులకు గురిచేసి లోన్ చెల్లించకుండ ఇంటిపై దాడి చేసి రాధాకృష్ణ జయసుధ దంపతులను కొట్టి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను గుంజుకోవడంతో పాటు కారు ఎత్తుకెళ్లిన సంఘటన లో బిఆర్ఎస్ నాయకుడు బండి సందీప్ చింటూ, అతని తల్లి నర్సంపేట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండి భారతి, బండి రమేష్ తో పాటు మరికొందరి పై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు.