గతంలో ఓ టీవీ షోలో నటి రాశిపై చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలకు.. యాంకర్ అనసూయ భరద్వాజ్ తాజాగా క్షమాపణలు చెప్పింది. ఆ స్కిట్లో వచ్చిన డైలాగులను అప్పట్లో ప్రశ్నించలేకపోయానని అంగీకరించింది.
అది తన తప్పేనని, కాలక్రమేణా తాను మారానని వివరణ ఇచ్చింది. మహిళల గౌరవం, భద్రత కోసం నిలబడటం నేర్చుకున్నానని సోషల్ మీడియాలో పేర్కొంది.
మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది.