Homeవరంగల్మేడారం పునరుద్దరణ పనులపై భక్తుల అసహం: పూర్తి కానీ జాతర పనులు

మేడారం పునరుద్దరణ పనులపై భక్తుల అసహం: పూర్తి కానీ జాతర పనులు

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జాతర ముంచుకొస్తున్న సమయంలో ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతుండటంపై వారు మండిపడుతున్నారు.

జాతర జరుగుతున్న సమయంలో పనులు చేపట్టడం ఏంటని భక్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. కనీసం ఆరు నెలల ముందే ఈ పనులు పూర్తి చేసి ఉంటే తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని వారు అభిప్రాయపడ్డారు.

సుదూర ప్రాంతాల నుండి అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చిన తమకు, ఈ పనుల వల్ల గర్భాలయం వరకు వెళ్లడం కష్టతరంగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 భారీ జనసందోహం మధ్య పనులు జరుగుతుండటంతో, చిన్న పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్లలో ఉండటం ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments