తిరుపతి: తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు కుటుంబ సమేతంగా వైకుంఠ ద్వార ప్రవేశం చేసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్బంగాస్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిలల్లాలని వైకుంఠనాథుడిని ఎంపీ డా.కడియం కావ్య వేడుకున్నారు.